Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సీనియర్ ఐఎఎస్ పైన దృష్టి పెట్టిన సిఎం... ఎవరు?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (18:56 IST)
ఎపి సిఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసి చర్చకు తెరలేపారు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా సిఎం మరో నిర్ణయం కూడా తీసేసుకున్నారట. అది కూడా ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ టిటిడి కార్యనిర్వహణాధికారిని మార్చాలని నిర్ణయానికి వచ్చేశారట. తెలుగుదేశం పార్టీ హయాంలో టిటిడి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన ఈయన డిప్యుటేషన్ పైన టిటిడి ఈఓగా వచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఐదు నెలల పాటు ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. కానీ తిరుమల ప్రత్యేక అధికారి పోస్టును మాత్రం మార్చేశారు. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ధర్మారెడ్డికి ఆ పోస్టును కట్టబెట్టారు.
 
ప్రస్తుతం ఈఓ పోస్టును కూడా అదేవిధంగా సీనియర్ ఐఎఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్‌కు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారట సిఎం. త్వరలోనే దీనికి సంబంధించిన జిఓ కూడా వెలవడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా కీలక పోస్టుల్లో ఉన్న ఐఎఎస్‌లను సిఎం మారుస్తూ వస్తుండటం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments