Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా నిధులు

Webdunia
ఆదివారం, 9 మే 2021 (16:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు నడుంబిగించింది. రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 
 
అందుకోసం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రాబోయే 6 నెలలకు రూ.60 లక్షలు మంజూరు చేయనున్నారు.
 
ఈ క్రమంలో 50  క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కూడా కొనుగోలు చేయనున్నారు. అంతేగాకుండా, 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. 
 
అటు, ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ కు అప్పగించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా తీరుతెన్నులను ఆయన పర్యవేక్షిస్తారు. 
 
అలాగే, ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరాపై కరికాల వలవన్‌ దృష్టిసారించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments