Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగులను సొంత మనుషుల్లా చూసుకుని వైద్యం అందించాలి. : శ్రీకాంత్ రెడ్డి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:35 IST)
కోవిడ్ కేర్ సెంటర్‌కు వస్తున్న రోగులను సొంతమనుషుల్లా చూసుకుని వైద్యం అందించాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రాయచోటి పట్టణ శివార్లలోని రాజంపేట మార్గంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ను శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలు, ఆహారం, పారిశుద్యపు చర్యలు, తదితర సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు. 
 
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్‌లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇక్కడ  వైద్యులు, సిబ్బంది  పూర్తి స్థాయిలో షిప్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. మంచి పోషకాహారాన్ని అందిస్తున్నారన్నారు. 
 
ప్రత్యేక మైన సిబ్బందిచే పారిశుద్యపు చర్యలు  భేషుగ్గా ఉన్నాయన్నారు. ఈ కేంద్రం నందు ఇప్పటికి 6 మంది అడ్మిషన్ అయ్యారన్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ నందు 130 పడకలు ఉన్నాయన్నారు. రాయచోటి, పరిసర ప్రాంతాలుకు చెందిన వారెవరైనా వైరస్ బారిన పడిన వారు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వసతి సౌకర్యాలతో ఈకేంద్రంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ నిర్దారణ రిపోర్ట్ రాకున్నా కానీ వారిని ప్రత్యేక గదులలో ఉంచి వైద్యం అందించాలని శ్రీకాంత్ రెడ్డి వైద్యులకు సూచించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments