Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేతనం ఎందుకు జప్తు చేయరాదు?

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిత్యం హైకోర్టుతో చీవాట్లు తింటున్నారు. తాజాగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ వైఖరిని తీవ్రంగా పరిగణించింది. పైగా, ఈయన నవంబరు నెల వేతనం ఎందుకు నిలిపి (జప్తు) వేయకూడదో చెప్పాలంటూ ప్రశ్నించింది. 
 
కరోనా సమయంలో వైద్య సేవల కోసం పలువురు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంది. ఈ క్రమంలో వీరికి ప్రతి నెల చెల్లించాల్సిన వేతనాల్లో భాగంగా 2 నెలల వేతనాన్ని ప్రభుత్వం చెల్లించలేదు. 
 
ఈ వేతనాల కోసం వారు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన హైకోర్టు సర్కారు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌కు చెందిన నవంబరు నెల వేతనాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణనను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments