Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ : మంత్రి బొత్స

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (20:16 IST)
రాజధాని అమరావితలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైనపుడు అన్ని వివరాలను బహిర్గతం చేస్తామంటూ ఆయన సోమవారం ప్రటించారు. 
 
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని.. సరైన సమయంలో ఆ అక్రమాల చిట్టా బహిరంగ పరుస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి తనకు రాజధానిలో భూములే లేవంటున్నారని.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన సవాల్‌ విసిరితే మొత్తం వివరాలు బయటపెడతామని హెచ్చరించారు. 
 
భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ పేర్కొన్న నాలుగు రాజధానుల అంశాన్ని మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించగా.. ఆ విషయం టీజీనే అడగాలంటూ సలహా ఇచ్చారు. రాజధానిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ఏం చెప్పారో.. ఇప్పుడేం మాట్లాడారో రికార్డు చూడాలని కోరారు. 
 
అమరావతిపై గతంలో భాజపా కూడా ఆరోపణలు చేసిందన్నారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందినది కాదన్నారు. కౌలు అందలేదని రైతులు ఆందోళన చేస్తున్నారనీ, ఇదే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడానని, వారం రోజుల్లో కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పైగా, రాజధానిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments