Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి చెట్టుతో నిషిత్ వివాహం... 'ఏం చేస్తాం.. మన చేతిలో లేనిది'.. అంటూ మంత్రి నారాయణ

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణకు అరటి చెట్టుతో వివాహం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నారాయణ మృతదేహాన్ని బుధవారం రాత్రి 7.30 గంటలకు నెల్లూరులోని నారాయణ వైద

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (08:52 IST)
ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణకు అరటి చెట్టుతో వివాహం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నారాయణ మృతదేహాన్ని బుధవారం రాత్రి 7.30 గంటలకు నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలోకి తీసుకురాగా, పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. గురువారం ఉదయం దహన సంస్కారాలు నిర్వహించారు. 
 
దహన సంస్కారాలు ప్రారంభంకాకముందు... 9.20 నిమిషాలకు నిషిత్ పార్థివ దేహాన్ని ఇంటికి వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించి అరటి చెట్టుతో పెళ్లి చేశారు. పెళ్లి కానివారు చనిపోతే కర్మక్రియలు చేయాలంటే ఈ తంతు పూర్తి చేయాల్సి ఉంది. అందుకనే నిషిత మృతదేహానికి- అరటి చెట్టుకు వివాహం చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు బోరున విలపించారు. 
 
ఆ తర్వాత 9.40 నిమిషాలకు పూలతో అలంకరించిన అంతిమయాత్ర శకటంలోకి మృతదేహాన్ని చేర్చారు. మంత్రి నారాయణ, నారా లోకేష్‌ ఆ శకటంలోనే పెన్న వరకు ప్రయాణించారు. ముత్తుకూరు రోడ్డు నుంచి హరనాథపురం సర్కిల్‌, మినీ బైపాస్‌ రోడ్డు మీదుగా పెన్నాతీరానికి అంతిమయాత్ర కొనసాగింది. ఆ శకటం వెనుక భారీగా వాహనాలు బారులు తీరాయి. గతంలో ప్రముఖులకు దహన సంస్కారాలు చేసిన చోటే నిషిత దహన సంస్కారాలు గావించడంతో పెన్నాతీరమంతా జనసముద్రంగా మారింది.
 
ఇదిలావుండగా, కుమారుడు చనిపోయినట్లు బుధవారం ఉదయం 6 గంటలకు లండన్‌లో ఉన్న మంత్రి నారాయణకు సమాచారం అందింది. అక్కడి నుంచి హుటాహుటిన రాత్రి 12 గంటలకు చెన్నై చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకల్లా కుమారుడి భౌతికకాయాన్ని ఉంచిన నెల్లూరులోని నారాయణ వైద్యకళాశాలకు వచ్చారు. 
 
భౌతికకాయం వద్ద 20 నిమిషాలపాటు మౌనంగా గడిపారు. ఎంతో మనోనిబ్బరంతో వ్యవహరించారు. బాధను దిగమింగుకుని ‘ఏం చేస్తాం.. మన చేతిలో లేనిది.. మనం చేయగలిగింది ఏమీ లేదు.. జరిగింది జరిగిపోయింది’ అంటూ కుటుంబ సభ్యులను, విద్యాసంస్థల ప్రతినిధులను ఓదార్చేందుకు ప్రయత్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments