ఏసీ గదుల్లో కూర్చొని అమరావతిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు : మంత్రి నారాయణ

ఠాగూర్
ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (14:31 IST)
ఏసీ గదుల్లో కూర్చొని నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ అన్నారు. రాజధాని పరిధిలోని నేలపాడులో గెజిటెడ్‌ అధికారుల ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై సీఆర్‌డీఏ ఇంజినీర్లు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని సూచించారు. 
 
'అమరావతి మునిగిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారు. రాజధాని నిర్మాణానికి మిగతా భూమిని భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. భూసేకరణ కంటే భూసమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం. గెజిటెడ్‌ అధికారులకు 14 టవర్స్‌లో 1,440 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. టైప్‌-1లో 384 ఇళ్లు, టైప్‌-2లో 336 ఇళ్లు నిర్మిస్తున్నాం. 
 
గ్రూప్‌-డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నాం. డిసెంబర్‌ 31 లోగా అన్ని టవర్లు పూర్తి చేస్తాం. అమరావతిలో రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నాటికి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తాం. ఐఏఎస్‌ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ట్రంక్‌ రోడ్డు, లేఅవుట్‌ రోడ్లు, ఐకానిక్‌ టవర్ల పనులు జరుగుతున్నాయి' అని నారాయణ వివరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments