Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా.. ఛీ.. నీ బతుకు చెడా...: చంద్రబాబు

ఠాగూర్
ఆదివారం, 3 మార్చి 2024 (10:21 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుపుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఘనత సాధించారు. సాక్షాత్ రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయాన్ని తాకట్టుపెట్టేశారు. సచివాలయ భవనాన్ని ఓ ప్రైవేట్ బ్యాంకుకు తాకట్టు పెట్టి ఏకంగా రూ.370 కోట్ల అప్పు తెచ్చారు. ఇది ఇపుడు ఏపీలో సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేతిగా ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమన్నారు. 
 
'రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్‌ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేశారు. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి' అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఒక సాధారణ దళిత రైతు కుటుంబంలో పుట్టి.. లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన ఘనతను బాలయోగి సాధించారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన అందించిన సేవలను... కోనసీమ అభివృద్ధికి చేసిన కృషిని చంద్రబాబు గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments