Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌‌కు - మోడీకి పెళ్లి చేశారు... ఎక్కడ.. ఎవరు?

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం అట్టుడుగుతున్న విషయం తెలిసిందే. హోదా కోసం అధికార తెలుగుదేశంపార్టీతో పాటు మిగిలిన పార్టీ నేతలందరూ కూడా కలిసికట్టుగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులను పక్కనబెట్టుకుని

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (17:27 IST)
ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం అట్టుడుగుతున్న విషయం తెలిసిందే. హోదా కోసం అధికార తెలుగుదేశంపార్టీతో పాటు మిగిలిన పార్టీ నేతలందరూ కూడా కలిసికట్టుగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులను పక్కనబెట్టుకుని హోదా వస్తే ఏంటి లాభం.. రాకుంటే ఎలాంటి నష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయడమే కాకుండా శాంతియుతంగా ఆందోళన చేయాలని కూడా పిలుపునిచ్చారు.
 
ఇదంతా జరుగుతుండగానే నాలుగు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో పవన్ కళ్యాణ్‌ ఒక బహిరంగ సభను పెట్టారు. ఆ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును, నారా లోకేష్‌‌లను ఏకిపారేశారు. దీంతో టిడిపి నేతలందరూ పవన్  కేంద్రానికి దగ్గరవుతున్నారు.. కేంద్రంలోని నేతల కనుసన్నల్లోనే జనసేన నడుస్తోందని కూడా ఎవరికి వారు చెబుతూ వచ్చారు. 
 
దీంతో తెలుగుదేశంపార్టీకి చెందిన శ్రీకాళహస్తి నేతలు పవన్ కళ్యాణ్‌‌కు - మోడీకి పెళ్ళి చేశారు. అది కూడా శ్రీకాళహస్తిలోని పెళ్ళి మండపానికి ఎదురుగానే. స్వామి, అమ్మవార్లకు వివాహం చేసే చోట పవన్ కళ్యాణ్‌, మోడీల దిష్టిబొమ్మలను తయారుచేసి వివాహం చేశారు. బిజెపి పెద్దలను పవన్ కళ్యాణ్‌ వివాహం చేసుకున్నట్లు మంత్రాలు కూడా చదివారు. ఇదంతా చూస్తున్న స్థానికులు నవ్వుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments