Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీపురుషులను ఒకే గదిలో నిర్బంధిస్తారా? చంద్రబాబు ఫైర్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (19:58 IST)
ఓ వైసీపీనేత ఫిర్యాదు చేశాడని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను ఏడేళ్ల చిన్నారితో సహా చిల్లకల్లు పోలీసు స్టేషన్‌కు తెచ్చి నిర్బంధించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. కొంతమంది పోలీసులు తాము అమలు చేయాల్సిన చట్టాలను వదిలేసి వైసీపీ నేతల మాటే చట్టంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు.
 
ఈ సందర్భంగా భూక్యా కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఓ గదిలో ఉన్న ఫోటోలను చంద్రబాబు షేర్ చేశారు. ఆ గదిలో చిన్నారి కూడా ఉండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్నారిలో మీకు ఏ నేరస్తుడు కనిపించాడు? స్త్రీ పురుషులను ఒకే గదిలో నిర్భంధించమని ఏ చట్టం చెబుతుందని మండిపడ్డారు.
 
కోవిడ్ నిబంధనలు పేరిట టీడీపీ వాళ్లను ఇబ్బంది పెట్టే మీకు ఇలా గుంపుగా అందరినీ ఒకచోట నిర్బంధించడానికి ఏ వైసీపీ చట్టం అనుమతించిందని ప్రశ్నించారు. కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments