Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీరం దాటిన అసని తుఫాను - భారీ వర్షాలు కురిసే అవకాశం

Webdunia
గురువారం, 12 మే 2022 (08:12 IST)
భయోత్పాతం సృష్టించిన అసని తుఫాను ఎట్టకేలకు మచిలీపట్నం - నరసాపురం మధ్య తీరం దాటింది. ఈ తుఫాను బలహీనపడి తీరం దాటినప్పటికీ వచ్చే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు ముగ్గురు మరణించగా, 900 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అలాగే, అనేక విమాన సర్వీసులను నిలిపివేశారు. 
 
ఇదిలావుంటే, ఈ తుఫాను తీరం దాటినప్పటికీ గురువారం రాత్రికి ఉత్తర దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ తుఫాను కారణంగా విశాఖపట్టణం, శ్రీకాకుళం, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఈ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 900 ఎకరాల్లోని పంటకు నష్టం వాటిల్లినట్టు అంచనా. 
 
మరోవైపు, అసని తుఫాను తీవ్రవాయుగుండంగా మారినప్పటికీ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మత్స్యుకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments