Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ జారీ

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (21:05 IST)
ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం గవర్నర్ హరిచందన్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. 16వ తేదీన ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 
 
కరోనా మూలంగా వాయిదా పడిన బడ్జెట్ సమావేశాలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  మొదటి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు.
 
మొదటి రోజు సభ ముగిసిన తర్వాత బడ్జెట్ రాష్ట్రంలోని ఇతర సమస్యలపై ఏయే అంశాలపై ఎంతెంత సమయం కేటాయించాలో శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. 
 
ఈనెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనుండడంతో ఈ సమయంలోనే బడ్జెట్ సమావేశాలు కలిసొచ్చేలా సమావేశాలకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే, శాసనమండలిని ఏపీ సర్కారు రద్దు చేసింది. దీనికి కేంద్రంతో పాటు పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సివుంది. కానీ, అది ఇంకా జరగలేదు. దీంతో శాసనమండలి జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments