Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుచ్చకాయల వ్యాపారిపై దాడి: వీఆర్‌లోకి పోలీసులు

Webdunia
శనివారం, 8 మే 2021 (11:28 IST)
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌లోకి పంపుతూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. లాక్‌డౌన్‌ అమల్లో భాగంగా ఒకటో పట్టణ ఎస్సై వెంకటేశ్వర రావు, సిబ్బంది గురువారం రాత్రి గస్తీ తిరుగుతుండగా పల్నాడు రోడ్డులో నరసయ్య అనే పుచ్చకాయల వ్యాపారి దుకాణం తీసి ఉండటాన్ని గుర్తించారు.

కర్ఫ్యూ అమల్లో ఉండగా రాత్రి సమయంలో దుకాణం ఎందుకు తీశావని పోలీసులు ప్రశ్నించగా వ్యాపారి వారితో దురుసుగా వ్యవహరించాడు. దీంతో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వ్యాపారిని స్టేషన్‌కు రమ్మని చెప్పగా అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు సదరు వ్యక్తిపై చేయిచేసుకున్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.

దుకాణం వద్ద జరిగిన గొడవ అంతా సీసీ కెమెరాలో నమోదైంది. శుక్రవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చిన వ్యాపారి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోను పోలీసు ఉన్నతాధికారులకు పంపాడు. స్పందించిన ఉన్నతాధికారులు ఎస్సై మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. ముగ్గురిని వీఆర్‌లోకి పంపూతూ ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయని డీఎస్పీ విజయ భాస్కరరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments