Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో లడ్డూల తయారీ కోసం రూ.50 కోట్లతో యంత్రం

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (15:35 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూల తయారీ కోసం రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి వేడుకులకు భక్తులు విశేషంగా తరలి వచ్చారన్నారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయినట్లు చెప్పారు. 
 
లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించినట్లు తెలిపారు. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న రథసప్తమి వేడుకలకు సంబంధించిన కానుకల లెక్కింపు చేపట్టనున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ఆయన.. త్వరలో మరో తేదీని నిర్ణయిస్తామని అన్నారు.
 
తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం జరుగుతోందని, తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనంద నిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళ్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుండటంతో తాపడం పనులు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. 
 
దీని ద్వారా శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ కోసం స్లాట్‌ను బుక్‌ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చని తెలిపారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని అన్నారు. ఎస్వీబీసీ ఛానెల్‌ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించే సదుపాయం ఉంటుందని అన్నారు. గత నెలలో 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. హుండీ కానుకలు రూ.123.07 కోట్లు కాగా, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.1.07 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments