Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఈసీ మృతిపట్ల గవర్నర్ బండారు సంతాపం

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:49 IST)
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ గాలి వెంకట గోపాల కృష్ణమూర్తి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జీవీజీ కృష్ణమూర్తి మృతి తనను బాధను కలిగించిందన్నారు. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎన్నో కీలక కేసులను వారు వాదించారని తెలిపారు. గతంలో వారు భారతీయ న్యాయ సంఘంలో మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారని, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనరుగా కూడా పనిచేశారని వారి సేవలను దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. 

1992లో తానూ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు గాలి వెంకట గోపాల కృష్ణమూర్తితో తనకు వారితో అనుబంధం ఏర్పడిందని, తాను  కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు తనకు కృష్ణమూర్తి అనేకమైన సలహాలు సూచనలు అందించేవారని, మృదుస్వభావి, స్నేహశీలి అయిన కృష్ణమూర్తి సేవలు ఎనలేనివని బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆ మహానుభావుడి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments