Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లోరిడాలో పారాసెయిలింగ్ ప్రమాదంలో బాపట్ల మహిళ మృతి

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (07:52 IST)
అమెరికాలో జరిగిన  పారాసెయిలింగ్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన సుప్రజ (34) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈమెకు భర్త శ్రీనివాసరావు, అక్షిత్ చౌదరి, శ్రీ అధిరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కుమారుడు అక్షిత్‌తో కలిసి సుప్రజ బోటు పారాసెయిలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. 
 
బలమైన గాలులు వీయడంతో ఆ పారాచ్యూట్‌ను బోటుకు అనుసంధానించిన తాళ్లు తెగిపోయాయి. దీంతో ఆ పారాచ్యూట్ ఓ వంతెనను బలంగా తాకడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుప్రజ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు తేలికపాటి గాయాలతో బయటపడ్డాడు. 
 
ఇదిలావుంటే, బాపట్ల జిల్లా మార్టూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు గత 2012లో అమెరికా వెళ్ళారు. శ్రీనివాస రావు షికాగోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అక్కడ నుంచి తమ మకాంను ఫ్లోరిడాకు మార్చారు. అక్కడ భార్యాపిల్లలతో ఉంటున్న సుప్రజ ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments