Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంతలు పూడ్చలేని ప్రభుత్వం.. గోతులు తీసే రాజకీయం...

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:20 IST)
రాష్ట్ర రహదారులపై గుంతలు పూడ్చుకోలేని ఏపీ ప్రభుత్వం, గోతులు తీసే రాజకీయం చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రో ధరల ప్రభుత్వం వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో సమానంగా పెట్రో ధరలు పెంచిన ప్రభుత్వం, తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. రాజధాని నిర్మాణం పేరిట రూ. 4 సెస్ వసూలు చేస్తూ, రాజధానిని ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. అలాగే, రహదారి సెస్ పేరుతో రూ.2 వసూలు చేస్తూ, గోతులు ఎందుకు పూడ్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
'కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు రూ. 19 వేల కోట్లే ఇచ్చిందని మీరు అంటున్నారు. అసలు కేంద్రం ఎంత ఇచ్చిందో లెక్క చెప్పండి? అంటూ ఆయన డిమాండ్ చేశారు. మాటిస్తే మడమ తిప్పనన్న జగన్ రాజధానిపై మాటెందుకు తప్పారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments