Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాపాక అమ్ముడు పోయిన సరకు... రూ.10 కోట్లా? రూ.10 వేలే ఎక్కువ : బొండా ఉమ

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (21:43 IST)
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలను తనను సంప్రదించి టీడీపీ అభ్యర్థిగా ఓటు వేయాల్సిందిగా డబ్బు ఆఫర్ చేశారంటూ జనసేన పార్టీ టిక్కెట్‌పై గెలిచి వైకాపా పంచన చేరిన రాపాక వరప్రసాద్ చేసిన ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ ఘాటుగా స్పందించారు. "రాపాక ఇప్పటికే అమ్ముడు పోయిన సరుకు. నిన్ను ఆల్రెడీ కొనేశారు నాయనా... దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్‌టు వైకాపా" అని బోర్డు ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందువల్ల "నువ్వుగానీ, నీలాంటి వైకాపా ఎమ్మెల్యేలు కానీ టీడీపీకి ఎందుకు.. దీనిపై సూటిగా సమాధానం చెప్పు" అంటూ రాపాకను ఆయన నిలదీశారు. 
 
తాడేపల్లి ప్యాలెస్ నుంచిన స్క్రిప్టునే రాపాక చదివారని బొండా ఉమ ఆరోపించారు. రాపాక ఓ చిల్లర మనిషి అని, జనసేన పార్టీ టిక్కెట్‌పై గెలిచి వైకాపాకు అమ్ముడు పోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ నీతులు చెబుతున్నాడంటూ మండిపడ్డారు. పైగా, రాపాకను కొనాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. టీడీపీకి కావాల్సిన 23 ఓట్లు స్పష్టంగా ఉన్నాయని బొండా ఉమ పేర్కొన్నారు. రాపాకను రూ.10 కోట్లు పెట్టి కొనేది ఎవరు అని, అతడికి రూ.10 వేలు కూడా ఎక్కువేనని బొండా ఉమ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments