Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిమిట్టలో 18న కల్యాణోత్సవం.. జర్మన్ షెడ్లతో కల్యాణ వేదిక..

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (11:03 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా, 18న రాత్రిపూట కల్యాణోత్సవం జరుగుతుంది. 
 
గత ఏడాది కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో కల్యాణోత్సవం వేళ, కురిసిన భారీ వర్షం, పందిళ్లు నేలమట్టమై, ప్రజలు ఇబ్బందులు పడిన నేపథ్యంలో.. ఈసారి అప్రమత్తమైన చర్యలు తీసుకున్నారు. కల్యాణ వేదికను సైతం మరింత పటిష్ఠంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. 
 
ఈ సంవత్సరం మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత వర్షం వచ్చినా చెక్కుచెదరని జర్మన్ షెడ్లతో కల్యాణ వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ కల్యాణోత్సవానికి దాదాపు లక్ష మంది వరకూ భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు లక్షల ముత్యాల తలంబ్రాలను టీటీడీ సిద్ధం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments