Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగపనులు చేసి చిప్పకూడు తిన్న చిట్టి రెడ్డికి బడాయి మాటలెక్కువ...

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (12:38 IST)
వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను చిట్టి నాయుడు అంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పదేపదే ప్రస్తావిస్తుండటంతో బుద్ధా వెంకన్న పరోక్షంగా జగన్‌ను చిట్టిరెడ్డి అంటూ సంబోధిస్తూ ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు గుప్పించారు. 
 
"చిట్టి రెడ్డి తండ్రి గెలిచిన చోట కాలర్ ఎగరేస్తాడు. కన్నతల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు. అయినప్పటికీ తనదే పైచేయి అంటాడు. దొంగ పనుల కారణంగా చిప్పకూడు తిన్నా బడాయి మాటలు మాట్లాడుతుంటాడీ చిట్టి రెడ్డి... చరిత్ర మర్చిపోయారా విజయసాయిరెడ్డి గారూ!" అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేశ్‌ను ఓడించేందుకు వైఎస్ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగాల్సి వచ్చిందని, పెయిడ్ ఆర్టిస్టులు సైతం అక్కడే మకాం వేసి లోకేశ్ ఓటమి కోసం పనిచేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఒక్క మంగళగిరిలోనే వైసీపీ గెలుపు కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు మీ మాటల్లోనే వెల్లడించినందుకు ధన్యవాదాలు అంటూ స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments