Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురి మృతి

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (10:48 IST)
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మినీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరో 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జిల్లాలోని నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన పలువురు మినీ బస్సులో తిరుమలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ మినీ బస్సులో 32 మంది కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా, వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు, వారి బంధువులుగా ఉన్నారు. 
 
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో చలపతి (45), బాదమ్మ (40) అనే దంపతులతో పాటు.. వీరి మేనల్లుడు ఈశ్వరయ్య (22)లు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments