Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాగుడుమూతల ఎంపీ బుట్టా రేణుకపై వేటుపడింది... నేడు టీడీపీ తీర్థం...

తుది శ్వాసవరకు వైకాపాలోనే ఉంటానంటూ ఒకవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తనవంతు ప్రయత్నాలను గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ వచ్చిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై వైకాపా

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (06:16 IST)
తుది శ్వాసవరకు వైకాపాలోనే ఉంటానంటూ ఒకవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తనవంతు ప్రయత్నాలను గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ వచ్చిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కన్నెర్రజేశారు. ఫలితంగా ఆమెపై సస్పెండ్ వేటు వేశారు. 
 
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో చర్చనీయాంశమైనట్టు తెలుస్తోంది. ఆమెను సస్పెండ్ చేయడం వల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసే అవకాశం కోల్పోతామని వైసీపీ నేతలు అనుకుంటున్నట్టు సమాచారం. కాగా, బుట్టా రేణుక భర్త ఇప్పటికే టీడీపీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. 
 
మరోవైపు, మంగళవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును రేణుక కలవనున్నారని, బాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని సమాచారం. కర్నూలు జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుకకు టీడీపీ తరపున పోటీ చేసేలా ఆమె తన సీటును ఖరారు చేసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments