Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసులో మమ్మల్ని ఏమీ చేయలేరు... ఎవరు?

ఓటుకు నోటు కేసులో తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని ఇంటరాగేషన్లు, ఇన్విష్టిగేషన్లు చేసుకున్నా తమకేమీ ఫర్వాలేదన్నారు.

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (22:02 IST)
ఓటుకు నోటు కేసులో తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని ఇంటరాగేషన్లు, ఇన్విష్టిగేషన్లు చేసుకున్నా తమకేమీ ఫర్వాలేదన్నారు. తాము చాలా క్లియర్‌గా ఉన్నామన్నారు. హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నాయకుడిని, జగ్గారెడ్డిని కేసుల పేరుతో వేధిస్తున్నారన్నారు. 
 
ఎన్నికల వచ్చినప్పుడు మాత్రమే విపక్ష నాయకులపై కేంద్ర ప్రభుత్వం ఐటీ, సీబీఐ, పోలీసులతో దాడులకు పాల్పడుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తమిళనాడు, కర్నాటకల మాదిరిగానే తెలంగాణాలోనూ ఇటువంటి దాడులే జరుగుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా అధికార వ్యవస్థలను తన చేతులోకి తీసుకుని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. 
 
ఏపీపైనా ప్రధాని మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. విభజన సమస్యలు అమలు చేయడంలో ఆయన విఫమయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలకు వివరిస్తామన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక నాయకులను చూసి జగన్, పవన్ కల్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు. అంతర్గతంగా రాజకీయ విమర్శలు చేసుకున్నా ఫర్వాలేదని, బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రం రాష్ట్రాభివృద్ధికి అంతా కలిసికట్టుగా ఉండాలని హితవు పలికారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments