Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదల బొమ్మాళీ వదల అంటున్న ఆర్ఆర్ఆర్ - ఇపుడు సాయిరెడ్డికి షాక్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (17:22 IST)
వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ పెద్దలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. మొన్నటికిమొన్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇపుడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. 
 
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ విజయసాయి రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని పిటిషన్‌లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. విజయసాయిరెడ్డికి శనివారం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి, సీబీఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విజయ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments