Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్ మూర్తి నాయుడు ఇకలేరు

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (17:17 IST)
CBN Brother
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్‌మూర్తి నాయుడు  కన్నుమూశారు. రామ్‌మూర్తి నాయుడు గత 2-3 సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం నుంచి అతని పరిస్థితి విషమంగా మారడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్రలో ఉన్న చంద్రబాబు నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అమరావతి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నారా లోకేష్ కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. 
 
వచ్చే నెలలో నారా రోహిత్ పెళ్లి జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. రామ్ మూర్తి నాయుడు గతంలో రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 1994-1999 మధ్య చంద్రగిరి నుండి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 
 
ఇక చంద్రబాబు నాయుడితో రాజకీయ విభేదాలు ఉన్నాయి. విభేదాలు రాజకీయాల వరకే. వీరి కుటుంబాలు ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటాయి. రోహిత్ సినీ కెరీర్‌కు అవసరమైనప్పుడల్లా చంద్రబాబు సపోర్ట్ చేశారు. రామ్ మూర్తి నాయుడు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments