ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి సీఈసీ క్లాస్.. దొంగ ఓట్ల గోలేంటి?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు క్లాస్ పీకారు. ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీకి పిలిపించి మరీ మందలించారు. ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో ఏకంగా మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులతో ఇంటంటి తనిఖీలు చేపట్టాలని, ఆ సమయంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ తనిఖీల్లో పాలు పంచుకునేలా చూడాలని ఆదేశించారు. 
 
ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చి కలవాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆయన మంగళవారం ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లి... ఈసీఐ డిప్యూటీ కమిషనర్ 3 గంటలపాటు సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 కార్యక్రమం సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు వంటి విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్ స్థాయి అధికారులను ఇంటింటికి పంపి వివరాలను తనిఖీ చేయిస్తామని తెలిపారు. అంతకుముందు రోజు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments