Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్నిపై తీర్పు రిజర్వు

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (10:03 IST)
స్వ‌తంత్రుల‌కే ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారాలు ఇవ్వాల‌ని, హైకోర్టులో ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ పూర్తైంది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ,  దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 
 
నీలం సాహ్నిని ఎస్​ఈసీ గా నియమించడాన్నిసవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండే వ్యక్తిని ఎస్​ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు గ‌తంలో తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. 
 
ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసినందున నీలం సాహ్ని స్వతంత్ర ఎస్​ఈసీ కాదని, పిటిషనర్ తరఫు న్యాయవాది శశిభూషణ్ రావు వాదనలు వినిపించారు. నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.




సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments