Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.1438 కోట్లు విడుదల

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (08:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో కూడిన సీమాంధ్ర ప్రదేశ్ తీవ్రమైన రెవెన్యూ లోటును ఎదుర్కోంటుంది. ఈ లోటును విభజన హామీల్లో భాగంగా కేంద్రం భర్తీ చేయాల్సివుంది. కానీ కేంద్ర ఆ పని చేయడం లేదు. నామమాత్రంగానే రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.1,438 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 
 
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు మొత్తం రూ.9,871 కోట్లను మూడో విడత రెవెన్యూలోటు భర్తీ కింద విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు దక్కాయి. వీటితో కలుపుకుని రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.4,314.24 కోట్లు అందాయి.
 
కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు కలిపి రూ.1,18,452 కోట్ల రెవెన్యూ గ్రాంటును విడుదల చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా, ఈ మొత్తాన్ని 12 వాయిదాల్లో చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తం వాయిదాల్లో కలిపి ఏపీకి మొత్తంగా రూ.17,256.96 కోట్లు రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments