Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వెనకడుగు లేదు.. కేంద్రం స్పష్టీకరణ

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (17:14 IST)
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌‌ ప్రైవేటీకరణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అలాగే, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలుపుదల చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని పేర్కొంది. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది. స్టీల్‌ప్లాంట్‌ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తన వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.
 
అయితే, ఇప్పటికిప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం చేయాలని కేంద్రం భావించడం లేదని, ప్లాంటును బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామంటూ కేంద్రమంత్రి ఫగ్గన్‌ సింగ్‌ గురువారం విలేకరులతో అన్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్లడం లేదని, ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంటు పనిచేసే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. 
 
ఈ విషయంలో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా చర్చిస్తామని తెలిపారు. అయితే ఆ తర్వాత కార్మికులు, తదితరులతో జరిగిన భేటీల్లో ఆయన ఈ విషయంపై విస్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో రకరకాల చర్చలకు తెరలేచింది. ఈ క్రమంలోనే ప్రైవేటీకరణపై కేంద్రం తాజాగా స్పష్టతనిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments