Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయికి జగన్ ఇచ్చిన గౌరవం అందరికీ తెలుసు...

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (09:09 IST)
వయసులో పెద్దవారైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను గౌరవించాలని వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ, గవర్నర్‌ను ఎలా గౌరవించాలో తమకు జగన్ చెప్పాల్సిన పనిలేదన్నారు.
 
వయసులో పెద్దవారైన గవర్నర్‌ను గౌరవించాలని జగన్ చెబుతున్నారని, మరి వయుసులో పెద్దవారు, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయనిచ్చిన గౌరవం ఏపాటిదో అందరికీ తెలుసని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 
 
కాగా, సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేస్తూ, గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను కూడా వారు చింపివేశారు. ఈ చర్యలపై సీఎం జగన్ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments