Webdunia - Bharat's app for daily news and videos

Install App

హౌ డేర్ యూ.. డోంట్ టచ్ మీ... పోలీసులకు అఖిలప్రియ వార్నింగ్

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (13:13 IST)
మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత అఖిల ప్రియా రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మీకెంత ధైర్య... నన్ను తాకొద్దు... నా రూంలోకి వచ్చే అధికారం మీకెవ్వరిచ్చారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమెను ఇంటి నుంచి బయటకురానివ్వకుండానే అరెస్టు చేశారు. 
 
ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్న అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలను వారు ఉంటున్న హోటల్ గదిలోనే నిర్బంధించారు. ఈ సందర్భంగా గదిలోకి వచ్చిన మహిళా పోలీసులపై భూమా అఖిలప్రియ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 
 
'మేడమ్ టచ్ చేయకండి. మీరు రూమ్‌లోకి వెళ్లే అథారిటీ ఉందా? మీరు నా గదిలోకి వెళ్లారా? లేదా? నేను గదిలో ఉన్నానో లేదో చెక్ చేసే అధికారం మీకు ఉందా? నేను బెడ్రూమ్‌లో ఉన్నానో లేదో అని చెక్ చేస్తారా? నేను హోటల్ వదిలేసి వెళితేనే కదా మీకు ప్రాబ్లమ్. రూమ్ నుంచి నేను బయటకు రాకూడదని ఎవరు చెప్పారు? మీరు నన్ను టచ్ చేయకండి ముందు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా అఖిలప్రియ తన గది నుంచి బయటకొచ్చేందుకు వీల్లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, అఖిలప్రియ లిఫ్ట్ ద్వారా కిందకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆమెను మగ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇటు టీడీపీ మద్దతుదారులు, అటు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో హోటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments