Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ శివాజీ వెనుక చంద్రబాబు... కన్నా

Webdunia
సోమవారం, 29 జులై 2019 (06:25 IST)
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. మీడియాతో మాట్లాడుతూ... గరుడ పురాణం సృష్టికర్త శివాజీ వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపించారు. ఇద్దరూ కలిసి తమ పార్టీపై, రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారని కన్నా ఎద్దేవా చేశారు. ఏపీలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు టీడీపీ అధినేత శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు.
 
ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ... కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని కన్నా వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించి నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సన్మానం చేసిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు.  ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే చంద్రబాబు బీజేపీపై ఆరోపణలు చేశారని ఆయన ధ్వజమెత్తారు.

కర్ణాటకలో తమకు పూర్తి బలం ఉందని.. అక్రమ పొత్తుతో అధికారంలోకి వచ్చారు కనుకే కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కుటుంబం కుప్పకూలిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీతో పాటు దేశమంతా బీజేపీవైపు చూస్తోందని.. యువత పెద్ద ఎత్తున తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని కన్నా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments