Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రి జగన్‌: చంద్రబాబు

Webdunia
గురువారం, 15 జులై 2021 (08:45 IST)
‘‘పరిపాలనను, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రిని ప్రస్తుతం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని బతిమలాడుకున్న జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమాన్ని గాలికి ఒదిలేశారు. ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఆఖరుకు చెత్తపై కూడా ఈ చెత్త ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. ముందు ముందు జుట్టు పన్నుకూడా వేస్తారు. ఇక అందరూ గుండు కొట్టించుకోవాల్సిందే’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లను మద్యం దుకాణాల వద్ద మందు బాబులను క్యూలో నిలబెట్టే పని చేయించుకున్నఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ ఖజానా వెలవెలబోతుంటే, ఆయన సొంత ఖజానా గలగల మంటోందన్నారు.

భారతి సిమెంటు లాభాలు ఎలా పెరుగుతున్నాయో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించిన జగన్‌రెడ్డి ఇంతవరకు సీపీఎ్‌సను ఎందుకు రద్దు చేయలేని చంద్రబాబు ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments