Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం సింఘాల్ తెలుగు నేర్చుకున్నారా... ఎవరు?: పవన్ ప్రశ్నలకు నో ఆన్సర్

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మూడురోజుల పాటు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ప్రోటోకాల్ ప్రకారం టిటిడి ఈఓతో పాటు పలువురు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. టిటి

Webdunia
శనివారం, 20 మే 2017 (21:01 IST)
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌కు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మూడురోజుల పాటు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ప్రోటోకాల్ ప్రకారం టిటిడి ఈఓతో పాటు పలువురు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. టిటిడి ఈఓను చూసిన చంద్రబాబు ఏమయ్యా... సింఘాల్ తెలుగు నేర్చుకున్నారా అంటూ తమాషాగా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు.
 
నీకు ఇక్కడ ఎలా ఉందంటూ ఈఓను ప్రశ్నించారు బాబు. సర్.. ఇక్కడ బాగుందంటూ ఈఓ చంద్రబాబుకు సమాధానమిచ్చారు. ఆ తరువాత ఈఓ భుజం తడుతూ వచ్చేశారు బాబు. టిటిడి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించినప్పటి నుంచి ఇప్పటివరకు తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. స్వాముల నుంచి, సినీప్రముఖుల వరకు అందరూ ఈఓ నియామకంపై విమర్శలు చేసిన వారే. 
 
ఉత్తరాదికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి టిటిడి లాంటి ప్రముఖ ధార్మిక సంస్ధకు ఈఓగా నియమించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చంద్రబాబునాయుడు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదే విషయంపై ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించారు. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని ఏ విధంగా టిటిడి ఈఓగా నియమిస్తారని బాబు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు పవన్. అయితే చంద్రబాబు మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానం ఇప్పటివరకు చెప్పనేలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments