Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (14:26 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆయన పర్యటన కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. రోడ్డు షోలు, బహిరంగ సభల నిర్వహణకు అనువుగా ప్రాంతాలను ఎంపిక చేశాయి. 
 
ఇందుకోసం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఆ తర్వాత కోడుమూరు, కరివేముల, దేవనకొండ మీదుగా రోడ్డు మార్గంలో పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం పత్తికొండలో రోడ్డు షోలో పాల్గొంటారు. 
 
ఆ తర్వాత కోరమాండల్ ఫర్టిలైజర్ ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి ఆదోనిలో బస చేస్తారు. గురువారం పట్టణంలో రోడ్డు షో నిర్వహించి, మధ్యాహ్నం ఎమ్మిగనూరులో రోడ్డు నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. 
 
రాత్రికి కర్నూలులో బస చేసి శుక్రవారం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలు  పర్యవేక్షించారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments