Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌ల కొనుగోలుపై ఆరోపణలు సరికాదు: ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

Webdunia
గురువారం, 2 జులై 2020 (17:16 IST)
అంబులెన్స్‌ల కొనుగోలుపై ప్రతిపక్ష నేతలు అవినీతి ఆరోపణలు చేయడం సరైంది కాదని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. 

గురువారం చిత్తూరు జిల్లాలో  104, 108, నియోనెటర్ అంబులెన్స్ సర్వీసులను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ..  ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ఏపీ సీఎం అని అన్నారు. 

ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే అత్యాధునికమైన అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నామని నారాయణ స్వామి తెలిపారు. 
 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసే ముందు నిజాలేంటో తెలుసుకోవాలని హితవు పలికారు. కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని మంత్రి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments