Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం పైకి ఉరికిన చిరుతపులి... చూడండి వీడియో...

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:08 IST)
వ్యవసాయ పొలాల వద్ద ప్రత్యక్షమైన చిరుతను చూసేందుకొచ్చిన జనంపై ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం వాణీయంబాడీ సమీపంలోని చిక్కనాకుప్పం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద చోటుచేసుకుంది. వాణీయంబాడీ సమీపంలోని చిక్కనాకుప్పం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద గురువారం ఉందయం చిరుత ప్రత్యక్షమైంది. 
 
దీనితో చిరుతను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే 2 గంటల ప్రాంతంలో ఇక్కసారిగా చిరుత జనంపైకి రావడంతో భయంతో పరుగులు తీశారు. పరుగులు తీస్తున్న వారిపై చిరుత దాడి చేసి గాయపరచింది. చిరుత దాడిలో అలివేలు, కమల్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను వాణీయంబాడీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు 20 మంది సిబ్బందిని నియమించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అది మాత్రం ఇంతవరకూ జాడ లేకుండా పోయింది. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments