Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ వీడియో కేసులో ఎస్సై, కానిస్టేబుల్ స‌స్పెన్ష‌న్

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (17:47 IST)
అవినీతి ఆరోపణల కేసులో ఒక ఎస్ఐ, కానిస్టేబుల్‌పై కృష్ణా ఎస్పీ సస్పెన్షన్ విధించారు. పోలీస్ అంటే ప్రజల్లో అపారమైన నమ్మకం ఉంటుంద‌ని, వారికి సమస్య వస్తే వెంటనే ఆశ్రయించేది పోలీసుల‌నే అని, అలాంటి పోలీస్ శాఖ పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా ఏ సిబ్బంది వ్యవహరించినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ స్ప‌ష్టం చేశారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న, సిబ్బంది సొంత ప్రయోజనాలకు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవడమే కాక, క్రిమినల్ కేసులు నమోదు చేయ‌డానికి వెనుకాడబోనని హెచ్చరికలు జారీ చేశారు.

అక్ర‌మ మద్యం స‌ర‌ఫ‌రా చేసిన కేసులో అడిగినంత లంచం ఇవ్వకుంటే మ‌రిన్ని బ‌నాయిస్తామని, ఒక యువకుడిని చిల్ల‌క‌ల్లు కానిస్టేబులు బెదిరించాడు. దీనితో ఆ యువకుడు ఓ సెల్ఫీ వీడియో తీసి మ‌రీ పోలీసుల దాష్టీకాన్ని వివ‌రించాడు. అనంత‌రం అత‌ను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీనికి కారణమైన చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎం.శివరామ కృష్ణ ప్రసాద్‌ను స‌స్పెండ్ చేశారు.

అంతే కాకుండా సిబ్బంది విధులు పట్ల సరైన పర్యవేక్షణ లేకుండా పోయినందుకు చిల్లకల్లు ఎస్ఐ కె.దుర్గా ప్రసాద్ రావుపై సస్పెన్షన్ వేటు విధిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments