Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ముందు బోరున విలపించిన అయ్యన్నపాత్రుడు... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (17:24 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా వైపు మొగ్గు చూపడాన్ని టీడీపీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఓటమిని తలచుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ కంటతడిపెడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు కంటతడి పెట్టడం. 
 
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగింది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులంతా హజరయ్యారు. 
 
ఈ సమావేశానికి హాజరైన అయ్యన్నపాత్రుడు ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో శ్రమించినా ఫలితం లేకపోయిందంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. 
 
ఎన్నో ప్రజా సంక్షేమ పనులు చేపట్టామని, నేతలందరూ తీవ్రంగా కష్టించారని, అయినాగానీ ప్రజలు వైసీపీ పట్ల ఆకర్షితులవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన చంద్రబాబుతో పేర్కొన్నారు.
 
ముఖ్యంగా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు మూతపడిన స్థితిలో దర్శనమివ్వడాన్ని చూడలేక పోతున్నామంటూ అయ్యన్న కంటతడి పెట్టడం పార్టీ వర్గాలను కూడా కదిలించింది. ఆయన్ను పార్టీ అధినేతతో పాటు.. ఇతర సభ్యులు ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments