Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో అంబులెన్స్ మాఫియాకు చెక్ పెట్టిన సర్కారు!!

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (12:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ డ్రైవర్ల మాఫియాకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇటీవల రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల నిర్వాకం వల్ల తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చనిపోయిన బిడ్డను ఓ కన్నతండ్రి 90 కిలోమీటర్ల దూరం మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లిన విషయం తెల్సిందే. 
 
ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతీయ మీడియా ఏపీలోని అంబులెన్స్ డ్రైవర్ల మాఫియాను బహిర్గతం చేసింది. అలాగే, రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అంబులెన్స్ డ్రైవర్ల దందాకు చెక్ పెట్టింది. 
 
ముఖ్యంగా, చిత్తూరు జిల్లా కలెక్టర్ అంబులెన్స్ దందాపై ఆర్డీవో, డీహెచ్ఎం, ఆర్టీవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంబులెన్స్ డ్రైవర్లు వసూలు చేయాల్సిన ధరలను ఫిక్స్ చేశారు. ఈ ధరల పట్టికను ఆయా ఆస్పత్రుల వద్ద ప్రధానంగా ప్రచురించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
 
ఈ ధరలకు మించి డబ్బులు వసూలు చేస్తే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈఎంటీబితో ఉన్న బేసిక్ లైఫ్ సపోర్ట్, పేషెంట్ ట్రాన్స్‌పోర్ట్ అంబులెన్స్‌లు కిలో మీటర్‌కు ఎంత మేరకు చార్జీలు వసూలు చేయాలన్న దానిపై బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments