Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతం రెడ్డి భౌతికయాన్ని చూసి సీఎం జగన్ భావోద్వేగం - సతీమణితో కన్నీటి నివాళి

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (16:25 IST)
ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి కన్నీటి నివాళులు అర్పించారు. ముఖ్యగా, తన సహచరుడు, కేబినెట్ మంత్రి గౌతం రెడ్డి భౌతికకాయాన్ని చూడగానే సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే, సీఎం జగన్‌ను చూడగానే మేకపాటి గౌతం రెడ్డి కుటుంబం బోరున విలపించింది. 
 
ఏపీ మంత్రి గౌతం రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. ఈ మరణ వార్త తెలియగానే ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు చేరుకున్నారు. అక్కడ తన భార్యను వెంటబెట్టుకుని హైదరాబాద్ నగరానికి చేరుకుని, జూబ్లీహిల్స్‌లోని మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి చేరుకుని కన్నీటి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కడి మేకపాటి కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరినీ కలిచివేశాయి. 
 
సీఎం జగన్‌ను చూడగానే గౌతం రెడ్డి తల్లి బోరున విలపించారు. గౌతం రెడ్డి సతీమణి, ఆయన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. తనను చూసిన గౌతం రెడ్డి కుటుంబ సభ్యులు బోరున విలపించడాన్ని  చూసిన జగన్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. గౌతం పార్ధివదేహం పక్కనే కుర్చీలో కూర్చొన్న జగన్ కన్నీరుకార్చారు. అలాగే, తన పక్కనే కూర్చొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని సీఎం జగన్ ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments