Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం చేస్తున్న మంచి పనులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం : సీఎం జగన్

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (15:44 IST)
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న మంచి పనుల పట్ల ఎలాంటి సంకోచం లేకుండా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం విజయవాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయగా, మరికొన్నింటికి కొత్తగా శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాలుపంచుకున్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రహదారుల విస్తరణకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో సత్వరమే నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.10,600 కోట్లను కేటాయించినట్టు సీఎం తెలిపారు. 
 
అలాగే, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. నితిన్ గడ్కరీ సహకారంతోనే బెజవాడ బెంజి సర్కిల్ వంతెన వేగంగా పూర్తయిందని చెప్పారు. రాష్ట్రానికి మరికొన్ని రహదారులు అవసరమని, వాటికి కూడా ప్రతిపాదనలు పంపుతామని, అవి మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ సభా ముఖంగా వేడుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments