Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ కాపు నేస్తానికి గొల్లప్రోలులో బటన్ నొక్కుడు

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (09:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒకటి వైఎస్ఆర్ కాపునేస్తం ఒకటి. ఈ పథకం కింద మూడో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేయనున్నారు. కాకినాడి జిల్లా గొల్లప్రోలులో ఆయన బటన్ నొక్కి నిధులను బట్వాడా చేస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. 
 
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై నుంచి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందన అర్హులైన పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున ఆయన ఆర్థిక సాయం చేస్తారు. మొత్తం 3,38,792 మందికి రూ.508.18 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో ఆయన జమ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.40 గంటలకు గొల్లప్రోలు నుంచి తిరిగి ప్రయాణమై తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments