Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రమేష్ కొత్తగా లగ్జరీ ఫ్లైట్ కొనుగోలు చేశారా?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (09:58 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇపుడు ఓ లగ్జరీ విమానాన్ని కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, కడప ఎయిర్‌పోర్టులో ఈ విమానికి ప్రత్యేక పూజలను కూడా ఆయన చేశారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, రాజకీయ పరమైన విమర్శలు కూడా వినిపించాయి.
 
దీంతో సీఎం రమేశ్ ప్రతినిధులు స్పందించారు. ఆ విమానం సీఎం రమేశ్‌కు చెందినది అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. ఆ విమానాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దానికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో సీఎం రమేశ్ ను కూడా ఆహ్వానించారని వెల్లడించారు. 
 
విమాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సీఎం రమేశ్ సంప్రదాయాలను అనుసరించి కొబ్బరికాయ కొట్టారే తప్ప, విమానం ఆయనది కాదని ఓ ప్రకటనలో వివరించారు. సీఎం రమేశ్ ఆర్థికంగా బాగా బలమైన వ్యక్తి కావడంతో ఆయన సొంతంగా చిన్న విమానం కొనుగోలు చేశారంటూ కథనాలు వచ్చాయి. 
 
కాగా, సీఎం రమేశ్ సన్నిహితుడు ఒకరు కొత్తగా లగ్జరీ విమానాన్ని కొనుగోలు చేయగా, ఆ విమానానికి సీఎం రమేశ్ కడప ఎయిర్ పోర్టులో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రమేష్ కూడా హాజరై, లాంఛనంగా కొబ్బరికాయ కొట్టారు. ఆపై విమానంలోకి ప్రవేశించారు. దీంత ఈ విమానం సీఎం రమేశ్ దేనంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments