Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నుంచి ఎప్పుడో బయటకు వచ్చా: మైసూరారెడ్డి

Webdunia
గురువారం, 22 జులై 2021 (11:23 IST)
వైసీపీ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చాన‌ని మాజీ ఎంపీ మైసూరా రెడ్డి స్ప‌ష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమ జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాద‌ని, నీటి ప్రాజెక్టులతో రాయలసీమకు తీవ్ర నష్టం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రాజెక్టులకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాల‌ని మైసూరా డిమాండే చేశారు. రాజకీయ లబ్ధి కోసమే రెండు రాష్ట్రాల నేతలు తిట్టుకుంటున్నార‌ని, రాష్ట్రాలు విడిపోయినా విడదీయలేని సంబంధాలున్నాయి కాబ‌ట్టి, రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాల‌ని సూచించారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ తెలంగాణ, రాయలసీమకు మంచినీటి కోసం ఏర్పడింద‌ని, శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పడం లేద‌ని మైసూరా ప్ర‌శ్నించారు. ఏపీ ప్రభుత్వం లేఖలు రాసి చేతులు దులుపుకుంటోంద‌ని, ఇపుడు కేంద్రం తెచ్చిన గెజిట్‌తో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం జ‌రుగుతోంద‌న్నారు.
 
రాయలసీమ ప్రాజెక్టులను జగన్ చిన్నచూపు చూస్తున్నార‌ని,  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించాలన్న జగన్... ఇప్పుడు ఎందుకు కల్పించడం లేద‌ని మాజీ ఎంపీ మైసూరారెడ్డి ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments