Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల మహా పాదయాత్రకు నీరాజనాలు పలకండి: సిపిఐ శ్రేణులకు రామకృష్ణ పిలుపు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:01 IST)
నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సిపిఐ శ్రేణులు ఘన స్వాగతం పలికి, పాదయాత్రలో పాల్గొనాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు.
 
ఈ మేరకు కె రామకృష్ణ మేరకు నేదోక ప్రకటన విడుదల చేశారు. "అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతుల 45 రోజుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా జరుగుతుంది. రైతుల పాదయాత్ర ఆయా జిల్లాలలోకి ప్రవేశించినప్పుడు సిపిఐ తరపున ఘనస్వాగతం పలికి, పార్టీ శ్రేణులు తప్పక పాదయాత్రలో పాల్గొనాలి.

సిపిఐ నియోజకవర్గ నాయకత్వం, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రకు స్వాగతం పలికి, నియోజకవర్గం వరకు తప్పక పాల్గొనాలి. తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం.

రైతుల మహాపాదయాత్రతోనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం"  అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments