Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో 3,100 పశువుల ఆస్పత్రులు నిర్మాణం

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:38 IST)
నాడు-నేడు పథకం ద్వారా రాష్ట్రంలో పశుసంవర్ధకశాఖ ద్వారా 3,100 పశువుల ఆస్పత్రి భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు.

మండపేట పశుశిక్షణా కేంద్రానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 1.12 లక్షలు పశువులు, 72,000 గొర్రెలను లబ్ధిదారులకు అందిస్తామన్నారు.

రాష్ట్రంలో రైతులకు పాలకు మెరుగైన ధర అందించేందుకు అమూల్‌పాలు కొనుగోలు కేంద్రా లు 2022, మార్చి నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే అనంతపురం, చిత్తురు, కడప, ప్రకాశం గుంటూరు జిల్లాల్లో అమూల్‌ పాల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.

చేయూత ద్వారా అందించే పశువు యూనిట్‌ విలువ రూ.75 వేలు ఉంటుందని, అది పూర్తి గా సబ్సిడీయేనన్నారు. గ్రామాల్లో రైతులు గతంలో నిర్మించుకున్న మినీగోకులాలకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు చెల్లింపు 32,000 వరకు ఉన్నాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మినీగోకులాలపై సర్వే నిర్వహిస్తా మని, ప్రస్తుతం ఈ పథకం నిలిచిపోయిందన్నారు. పాలు ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments