Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా - ఆటోనగర్‌లో కలకలం : టీ వ్యాపారికి కరోనా పాజిటివ్ ...

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (21:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ హల్చల్ సృష్టిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పైగా, ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. బుధవారం కూడా 70కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కర్నూలు, కృష్ణ, గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. 
 
ఇంతలోనే కృష్ణా జిల్లాలో ఓ కలకలం చెలరేగింది. జిల్లాలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఓ టీ వ్యాపారికి కరోనా వైరస్ సోకినట్టు వార్త స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ టీ వ్యాపారి స్థానికంగానే కాకుండా, కార్మిక్ నగర్, ఆటో నగర్‌లలో కూడా టీ విక్రయిస్తూ పోషణ సాగిస్తున్నాడు. దీంతో ఆ రెండు ప్రాంతాల వాసులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
టీ దుకారణ యజమానికి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా, ఈ టీ దుకాణంలో టీ సేవించిన వారిని గుర్తిస్తున్నారు. వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, వైరస్ నిర్ధారణ అయినవారిని ఆస్పత్రికి మిగిలిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments