Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల వ్యవధిలో 21,954 కేసులు

Webdunia
గురువారం, 6 మే 2021 (22:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 1,10,147 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 21,954 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,28,186కు పెరిగాయి. 
 
రాష్ట్రంలో 20 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది వరుసగా నాలుగోరోజు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహమ్మారి ధాటికి మరో 72 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 8,446కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 10,141 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3,531 కేసులు వెలుగులోకి వచ్చాయి. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 548 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
ఇక విశాఖలో ఒక రోజు వ్యవధిలో అత్యధికంగా 11 మంది మరణించగా.. తూర్పుగోదావరిలో 9 మంది, విజయనగరంలో 9 మంది, అనంతపురంలో 8 మందిని మహమ్మారి కబళించడంతో కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments