Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సచివాలయాన్ని పలకరించిన కరోనా.. ఇద్దరికి పాజిటివ్

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (12:48 IST)
తెలంగాణ సచివాలయాన్ని కరోనా పలకరించింది. తెలంగాణ సెక్రటేరియట్ బీఆర్కే భవన్‌ 7వ అంతస్తులో ఉన్న ఆర్థికశాఖలో పని చేసే ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిద్దరూ తండ్రీకొడుకులు అని తెలిసింది. ఈ మధ్యే వీళ్లు బంధువు అంత్యక్రియలకు వెళ్లి వచ్చారు. తాజాగా వీరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో శాంపిళ్లు తీసి, పరీక్షలకు పంపారు. 
 
సోమవారం ఫలితాలు రావడంతో సెక్రటేరియట్ మొత్తం ఉలిక్కిపడింది. ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది హోం క్వారంటైన్‌కి వెళ్లారు. సోమవారం సాయంత్రం బీఆర్కేభవన్‌లోని ఏడో అంతస్తును శానిటైజ్‌ చేశారు. బీఆర్కేభవన్‌ పక్కనే ఉన్న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ కరోనా కేసు నమోదైంది.
 
నాలుగో అంతస్తులో పనిచేసే ఓ ఉద్యోగి(38)కి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతడి భార్య ఓ ప్రభుత్వాస్పత్రిలో నర్సుగా పనిచేస్తోందని తెలిసింది. ఆమెకు లక్షణాలు లేకపోవడంతో... వైరస్‌ ఎలా వ్యాప్తిచెందిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 
 
తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి కాన్వాయ్‌లో గన్‌మన్‌గా పనిచేస్తున్న ఓ ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. అతడు మంత్రి కాన్వాయ్‌లో ఉంటాడే తప్ప ఆయనతో ఎలాంటి కాంటాక్టులు లేవని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments